Kavithamma protested against the ‘forcible collections’ from poor families in the name of One-Time Settlement (OTS) by the YSRCP government.
ఓటీఎస్ విధానం పేరుతో సీఎం జగన్ మోసం చేస్తున్నారని టీడీపీ మండల అధ్యక్షురాలు కోట్ల కవితమ్మ అన్నారు. ఆదివారం ఆమె మాట్లాడారు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాల కోసం. ఇప్పుడేమో రిజిస్ట్రేషన్ చేయించుకుని పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రూ. 10 వేలు వసూలు చేయడం వైసీపీ ప్రభుత్వానికి తగదని ఆమె అన్నారు. గ్రామ సచివాలయాల్లో ఇళ్లను ఓటీఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం చట్ట విరుద్ధమని ఆమె అన్నారు. 27న కర్నూలులోని టీడీపీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఓటీఎస్కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయానికి ఆమె లేఖ అందజేశారు.